వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..
ప్రభుత్వం చేపట్టిన సర్వే న్యాయ సమ్మతం కాదని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై గురువారం న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను ఆలకించింది.
సమగ్ర సర్వే తప్పనిసరి కాదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సర్వే స్వచ్ఛందంగానే నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలు కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని న్యాయస్థానానికి విన్నవించారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం లేదని తెలిపారు.
బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నెంబరు లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలని, వాటిని ప్రభుత్వం అడగకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. గణాంకాల చట్టం ప్రకా సర్వేకు ముందు ప్రకటన ఇవ్వాలని తెలిపారు. పన్నుల విధింపు, ప్రాసిక్యూషన్ సర్వే వివరాలు ఇవ్వకూడదని అన్నారు. సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకూడదని పేర్కొన్నారు.
Comments
English summary
High Court on Thursday said that Participating in Telangana Survey is people's choice.
Story first published: Thursday, August 14, 2014, 17:24 [IST]