ఏడ్చిన మహిళ, కోదండ ఇంటికి ముత్తా(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ నగరంలో తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా తమ ప్రచారాన్ని నగరంలో ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తాగోపాల్ తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాంను కలిశారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని కోదండరాంను కోరినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ తన నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన హిమాయత్నగర్లో పర్యటిస్తున్న సందర్భంలో ఆయనను ఒక మహిళ కలిశారు. మద్యాన్ని నిషేధించేలా చూడాలని ఆమె కన్నీటిపర్యంతమవుతూ దానంను కోరారు. కాగా, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంపి వి హనుమంతరావు తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ ప్రచారం నిర్వహించారు.
సిపిఎం పార్టీ నాయకులు కూడా తమ ప్రచారాన్ని కొనసాగించారు. సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం పార్టీ ప్రచారాన్ని ముషీరాబాద్లో నిర్వహించారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్ల శ్రీనురాజు తరపున జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి, అధికార ప్రతినిధి సుధారాణిలు రోడ్షో నిర్వహించారు. మిర్జాల్గూడ చౌరస్తా నుంచి మల్కాజ్గిరి మీదుగా సాయినగర్, వాణినగర్, ఆర్కెనగర్, ఆనందభాగ్, సఫిల్గూడ చౌరస్తా, కృప కాంప్లెక్స్ ముదుల్లా కుడలి, నేరెడ్మెట్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ జెండాలతో చిన్నారులు
కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ తన నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కాంగ్రెస్ జెండాలను పట్టుకున్న దృశ్యం.
మద్యం నిషేధించాలని ఏడ్చేసిన మహిళ
దానం నాగేందర్ హిమాయత్నగర్లో పర్యటిస్తున్న సందర్భంలో ఆయనను ఒక మహిళ కలిశారు. మద్యాన్ని నిషేధించేలా చూడాలని ఆమె కన్నీటిపర్యంతమవుతూ దానంను కోరారు.
తమ్మినేని ప్రచారం
సిపిఎం పార్టీ నాయకులు కూడా తమ ప్రచారాన్ని కొనసాగించారు. సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం పార్టీ ప్రచారాన్ని ముషీరాబాద్లో నిర్వహించారు.
మా అభ్యర్థికే మీ ఓటు
ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాస్ తరపున తమ్మినేని వీరభద్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
కోదండరాంతో ముత్తా భేటీ
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా తమ ప్రచారాన్ని నగరంలో ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ముషీరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తాగోపాల్ తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాంను కలిశారు.
ఆత్మీయ ఆలింగనం
అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంపి వి హనుమంతరావు తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ ప్రచారం నిర్వహించారు.
జై సమైక్యాంధ్ర పార్టీ ర్యాలీ
మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్ల శ్రీనురాజు తరపున జై సమైక్యాంధ్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి, అధికార ప్రతినిధి సుధారాణిలు రోడ్షో నిర్వహించారు.
తులసిరెడ్డి ప్రసంగం
మిర్జాల్గూడ చౌరస్తా నుంచి మల్కాజ్గిరి మీదుగా సాయినగర్, వాణినగర్, ఆర్కెనగర్, ఆనందభాగ్, సఫిల్గూడ చౌరస్తా, కృప కాంప్లెక్స్ ముదుల్లా కుడలి, నేరెడ్మెట్ చౌరస్తా వరకు సమైక్యాంధ్ర పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.