ముళ్లపొదల్లో మూడు తలలు, అవయవాలు
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని ముళ్లపొదల్లో మానవ శరీర భాగాలు పడి ఉన్నాయి. ఆ సంఘటన పట్టణవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన మూడు తలలు, ఇతర విడిభాగాలు ప్రజలను గగుర్పాటు కలిగించాయి.
స్థానికుల సమాచారం మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ శరీర భాగాలు ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన గుర్తుతెలియని వ్యక్తులవిగా నిర్ధారించారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందినప్పుడు వారి మృతదేహాలను పోస్టుమార్టం చేసి మూడు నెలలు పాటు ఆసుపత్రిలో భద్రపరుస్తారు.

తరువాత కూడా మృతులకు సంబంధించినవారు రాకపోతే ఆ మృతదేహాలను ఆసుపత్రి వారు మున్సిపల్ అధికారుల సాయంతో ఖననం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విడిభాగాలు కూడా ఆ కోవకు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖననం చేయాల్సిన మృతదేహాల విడిభాగాలను నిర్లక్ష్యంగా బాక్సులలో పెట్టి ముళ్లపొదల్లో పడవేసి ఉంటారనే అనుమానాన్ని బందరు డిఎస్పీ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications