ఆ రెంటిపై ఆగ్రహం... గంటన్నరపాటు పవన్ చర్చలు, తెలివిగా ఓకే చెప్పా: బాబు
తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో నెరవేర్చక పోవడం పైనే సిపిఐ నేతలు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది.
అమరావతి: తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో నెరవేర్చక పోవడం పైనే సిపిఐ నేతలు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది.
గురువారం గంటన్నర పాటు పవన్, సిపిఐ నేతలు మాట్లాడుకున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన చర్చించారు. ముఖ్యమంగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పైన చర్చించారు.
ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు కట్టబేట్టే అంశం పైనా చర్చించారు. రాజధాని నుంచి పోర్టు వరకు అవసరానికి మించి చంద్రబాబు ప్రభుత్వం భూములు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. రాజకీయ పొత్తుల గురించి మాత్రం చర్చించలేదంటున్నారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే అంశంపై చర్చించారు.సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ వెల్లడించారు.

తెలివిగా ప్యాకేజీకి ఒప్పుకున్నా: చంద్రబాబు
కేంద్ర ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి తాను తెలివిగానే ఒప్పుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం తనను విమర్శిస్తున్నారన్నారు. తనకు తెలియని విషయాలు చెబితే స్వీకరిస్తానని చెప్పారు.
తాజాగా పోలవరం ప్రాజెక్టుకు రూ. 2915 కోట్లు నాబార్డు నిధులిస్తున్నారన్నారు. భూసేకరణకు కూడా సుమారు 27 వేల కోట్లు అవసరమవుతుందన్నారు. 40 వేల ఎకరాలు భూమి కొనివ్వాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ప్రాజెక్టుకు ఇంకా రూ. 37 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించాలో, తెగదెంపులు చేసుకోవాలో తెలిసే ప్యాకేజీకి ఒప్పుకున్నానని చెప్పారు. హోదాకు తగ్గకుండా ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. బంగారు విషయంలో ఎవరూ భయపడవద్దని, తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
అన్నదాతకు భరోసా: రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లు! -
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు












Click it and Unblock the Notifications