అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం కష్టాల పాలైందని, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనా మేరకు మూడు లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సమాచారం అందుతోందని, వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. వారికి అండగా ఉండి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల గణన సత్వరమే చేపట్టి మానవతా దృక్పథంతో వారికి పరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

వరి పంటను సాగు చేసిన రైతులను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయని, ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో సాగు చేసిన జయ రకం ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ధాన్యాన్ని ఆర్బీకేలలో తీసుకోకపోవడం వల్ల బస్తాను 300 రూపాయల నష్టంతో రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని, దళారులు, మిల్లర్లు లాభ పడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్ట పడిన రైతు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు చేతికొచ్చిన మామిడి పంట నేల రాలిపోయిందని, మొక్కజొన్న కూడా మొలకెత్తుతోందని, ఇటువంటి కష్ట కాలంలో రైతులకు భరోసా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇదే సమయంలో రైతాంగం కోసం ప్రత్యేక పాలసీలు తీసుకువస్తామని, రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థిక నేతలతో చర్చిస్తున్నామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలు తను కళ్లారా చూశానని అన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులు ముఖ్యంగా కౌలు రైతుల ఆవేదన కళ్లారా చూశానన్నారు.
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/rSyUJNgL2W
— JanaSena Party (@JanaSenaParty) May 2, 2023
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాలలో, కల్లాలలో కలిసినపుడు వారు పడిన బాధలు తెలుసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నానని రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేకమైన విధానాన్ని తీసుకువస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications