పరిస్థితి చేజారాక, ఎదుర్కోవాల్సిందే: చంద్రబాబుపై మళ్లీ పవన్ కళ్యాణ్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజల భావోద్వేగాలతో టీడీపీ చెలగాటమాడిందన్నారు.
పరిస్థితులు చేజారిన తర్వాత అవిశ్వాస తీర్మానం విషయమై చంద్రబాబు మేల్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు ఎదుర్కోవాల్సిందే అన్నారు. హోదా ఇస్తానని చెప్పి మోడీ ఇవ్వలేదని మండిపడ్డారు.

అంతకుముందు కూడా పవన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమన్నారు. 25 కోట్ల మంది ఎంపీలను భయపెడితే 5 కోట్ల మంది ప్రజలు భయపడరని చెప్పారు. కేంద్రంపై పోరాటంలో అవసరమైతే ప్రాణాలు అర్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తోందని, ఈ వైఖరి సరికాదన్నారు.
ప్రత్యేక హోదా గురించి నాడు సభలో అడిగిన వారి హోదాలు పెరిగాయే తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదన్నారు. నిన్నటి వరకు వైసీపీ తనను టీడీపీ మనిషి అన్నదని, ఇప్పుడు టీడీపీ నేతలు తనను బీజేపీ, జగన్ మనిషిని అంటున్నారని విమర్శించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications