పవన్ కళ్యాణ్ ప్రశ్నించొచ్చు, నిలదీస్తాం: బాబుకు వీర్రాజు ఝలక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ అంశం పైన అయినా ప్రశ్నించవచ్చునని బీజేపీ నేత సోము వీర్రాజు సోమవారం అన్నారు. తాము (బీజేపీ) చేస్తున్న అభివృద్ధి చూసి పవన్ తమకు మద్దతు పలుకుతారని భావిస్తున్నామని చెప్పారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ అంశం పైన అయినా ప్రశ్నించవచ్చునని బీజేపీ నేత సోము వీర్రాజు సోమవారం అన్నారు. తాము (బీజేపీ) చేస్తున్న అభివృద్ధి చూసి పవన్ తమకు మద్దతు పలుకుతారని భావిస్తున్నామని చెప్పారు.
తెలుగుదేశం గురించి మాట్లాడుతూ... మిత్రపక్షం అయినంత మాత్రాన తాము ప్రశ్నించకుండా ఉండలేమని సోము వీర్రాజు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. అంగన్వాడీల సమస్యలు, ఉత్తరాంధ్ర మత్స్యకారుల జెట్టి సమస్య తదితరాలపై ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.

నాణ్యమైన పౌష్టిక ఆహారం: సునీత
గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. అన్న అమృతహస్తంలో భాగంగా అందించే ఆహారంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు నాణ్యమైన నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications