సిద్ధార్థనాథ్ గారూ! ఒక్క ప్రశ్న, ఎంతో అనుభవం: బీజేపీకి పవన్ కళ్యాణ్ కౌంటర్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్కు బుధవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్కు బుధవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్క ప్రశ్నే అడుగుతున్నానంటూ.. నోట్ల రద్దు తర్వాత వరుసలో నిలబడి మృతి చెందిన వారి గురించి అడిగారు.
5 ప్రశ్నలు వేశాంగా.. సమాధానం చెప్పలేదేం: పవన్ కళ్యాణ్కు బీజేపీ చురక
ఇంత రాజకీయ అనుభవం కలిగిన మీ పార్టీ ఇంత ఘోరమైన నిర్ణయం (నోట్ల రద్దు) ఎలా తీసుకున్నదని ప్రశ్నించారు. మీ నిర్ణయం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసుకుందన్నారు. ఏ తప్పు చేయని సామాన్యులను బలి చేశారన్నారు. తాను ఈ ఒక్క ప్రశ్నే అడుగుతున్నానని చెప్పారు.
'నేను బీజేపీ ఏపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథి సింగ్ను ఒకే ప్రశ్న అడగుతున్నా. ఎంతో అనుభవం కలిగిన నేతలు, ప్రజాప్రతినిధులుగా కూడా ఎంతో అనుభవం కలిగిన మీ పార్టీ (బీజేపీ) నోట్ల రద్దు వంటి దారుణమైన నిర్ణయాన్ని ఎలా తీసుకుంది. నోట్ల రద్దు కారణంగా ఏ తప్పు చేయని సామాన్యులు మృతి చెందారు' అని పేర్కొన్నారు.