జూ ఎన్టీఆర్ సహా వారంతా నాకిష్టం, మద్దతివ్వండి - పవన్ ఎన్నికల నినాదం..!!
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. ఎన్నికల నినాదం డిసైడ్ చేసారు. వైసీపీ లక్ష్యంగా పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పొత్తుల అంశం ప్రస్తావించకుండానే పవన్..తన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రతీ సభలోనూ సహచర సినీ హీరోల పేర్లను చెబుతూ..వారంతా తనకు ఇష్టమని చెప్పుకొస్తున్నారు. అందరి హీరోల అభిమానులూ రాజకీయంగా జనసేకు అండగా నిలవాలని కోరుతున్నారు.
పవన్ కీలక వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ అమలాపురం సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్లో జనం బాగుండాలంటే జగన్ పోవాలని వ్యాఖ్యానించారు. హలో ఏపీ- బైబై వైసీపీ నినాదం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రికి క్లాస్వార్ గురించి మాట్లాడే హక్కులేదని తేల్చిచెప్పారు.

క్లాస్వార్ గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు, జనసేనకే ఉందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. 2.30లక్షల జాబ్ కేలెండర్ను లేకుండా చేసారని ఆరోపించారు. గోదావరి జిల్లాల రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేశాడు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కావాలా.. లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
హీరోల అభిమానులకు పిలుపు
పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా తరచూ సినీ హీరోలు..వారి అభిమానుల గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు అమలాపురం సభలోనూ జూనియర్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్చరణ్, చిరంజీవి సహా హీరోలంతా తనకు ఇష్టమని పవన్ చెప్పుకొచ్చారు. అందరి హీరోల అభిమానులూ రాజకీయంగా జనసేకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హీరోలు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారని... వాళ్లు సినిమాలు చేస్తే కొంతమందికి పని దొరుకుతుందని చెప్పారు.

సినిమాలు విడుదలైతే స్థానికంగా చాలామంది వాటి మీద ఆధారపడి బతుకుతారని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారని..రూ 25 వేల కోట్ల ఆదాయం సంపాదించారని ఆరోపించారు. ఒక సారి ప్రధానికి చెప్పాలనిపిస్తోందని..మొన్న కలిసినప్పుడు చెప్పలేకపోయానని పవన్ వ్యాఖ్యానించారు.
చట్టసభలకు పంపండి
జనసేనను చట్టసభలకు పంపండి.. పార్లమెంటు బద్దలయ్యేలా జనసేన గొంతు ఉంటుందని పవన్ చెప్పకొచ్చారు. రాష్ట్రంలో మహిళా వివక్ష ఉందని...దీనిని తామ మారుస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కోనసీమ రైల్వేలైన్ను ఒక చాలెంజ్గా తీసుకుని.. తన జీవిత కాలంలో కచ్చితంగా తీసుకొస్తానని మాటిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.

ప్రజలకు విద్య, వైద్యం సంపూర్ణంగా అందేలా చూస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తామని.. వైద్యం మొత్తం ప్రభుత్వమే భరించేలా మంచి పథకం తీసుకొస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎక్కడా టీడీపీ, బీజేపీ ప్రస్తావన చేయకుండా వైసీపీ లక్ష్యంగా పవన్ చేస్తున్న వారాహి యాత్రలో ఇప్పుడు హీరోలు..అభిమానుల ఓట్ బ్యాంక్ ను టార్గెట్ గా చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు సినీ..పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతున్నాయి.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications