ఎపి రాజధాని: భూసేకరణపై పవన్ కళ్యాణ్ దీక్ష?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలవంతపు భూసేకరణ జరిపితే తాను ప్రజలకు అండగా నిలుస్తానని, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ మార్చిలో రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా ముందుకు రావాలనే వ్యూహాన్ని ఆయన వర్గం ఖరారు చేస్తున్టన్లు చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేపట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మే 23వ తేదీన దీక్ష చేపడితే ఎలా ఉంటుందనే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. బేతపూడి, రాయపూడి వంటి రెండు మూడు ప్రదేశాల్లో దీక్ష చేపట్టాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, అధికారికంగా మాత్రం పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి నుంచి మాత్రమే భూమి తీసుకోవాలని, బలవంతంగా భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వానికి సూచించారు.

చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మధ్య సంబంధాలు సజావుగానే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు నియామకం విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన సూచనను మన్నించినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష చేసినా అది కేవలం నిరసన వ్యక్తం చేయడమే తప్ప తీవ్రమైన విషయం కాకపోవచ్చునని టిడిపి వర్గాలంటున్నాయి.
బలవంతంగా భూములు సేకరిస్తే తాను నిరాహార దీక్షకు దిగుతానని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన దీక్ష చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications