బాబూ! సమాధానం చెప్పండి: టిటిడిపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఆయన సోమవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
హైదరాబాద్/అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఆయన సోమవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉత్తరాది ఐఏఎస్కు తాను వ్యతిరేకం కాదని చెప్పారు.
అమర్నాథ్, వారణాసీల మాటేమిటి?
అయితే, అమర్నాథ్, మధుర, వారణాసిలాంటి పవిత్ర ప్రాంతాలలో దక్షిణాది ఐఏఎస్లకు బాధ్యతలను ఎందుకు అప్పగించరని జనసేన అధినేత ప్రశ్నించారు. ఉత్తరాది వ్యక్తిని ఈవోగా నియమించిన టిడిపి ప్రభుత్వం నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఉత్తరాది వ్యక్తిని ఎలా నియమిస్తారు?
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతారని చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాష్ట్రానికి ఉత్తరాదికి చెందిన అధికారిని ఈవోగా తీసుకురావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం
రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాధి అధికారిని టిటిడి ఈవోగా ఎలా నియమిస్తారని చంద్రబాబును నిలదీస్తున్నారు. టిటిడి ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్తామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.

ఇవీ ఆరోపణలు
తెలుగు చదవడం రాని వారిని టిటిడి ఈవోగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టిటిడి ఆగమాలపై అవగాహన లేనందువల్ల కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. ఉత్తరాది ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications