ఏడు సిద్ధాంతాలు-12 హామీలు: జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్
Recommended Video

పశ్చిమగోదావరి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు కొద్ది నెలలుండగానే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఎన్నికల సమయంలో తుది మేనిఫెస్టోను మరోసారి విడుదల చేస్తామని పవన్ ఇప్పటికే చెప్పారు.
కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్.. తాజాగా పార్టీ మేనిఫెస్టో (దార్శనిక పత్రం) విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆయన భీమవరంలోని మావుళ్లమ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు.

జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఇవే..
1. కులాలను కలిపే ఆలోచనా విధానం
2. మతాల ప్రస్తావన లేని రాజకీయం
3. భాషలను గౌరవించే సంప్రదాయం
4. సంస్కృతులను కాపాడే సమాజం
5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
6. అవినీతిపై రాజీలేని పోరాటం
7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
మేనిఫెస్టోలో మచ్చుతునకలంటూ హామీలు:
1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
3. రేషన్కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ
4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు
5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్ల కల్పన
7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు
11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
కాగా, తాము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications