పిన్నెల్లి వ్యవహారంలో పవన్ మౌనం వెనుక - అసలు కారణం..!!
ఏపీలో వైసీపీ నేత పిన్నెళ్లి వ్యవహారం కలకలంగా మారింది. పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ దక్కటంతో పిన్నెళ్లి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం కండీషన్లతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారం పైన జనసేనాని పవన్ ఇప్పటి వరకు స్పందించక పోవటం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది.
పల్నాడులో ఉద్రిక్తత
ఏపీలో పోలింగ్ రోజున పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు జరిగాయి. పోలింగ్ జరుగుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. దీని పైన ఎన్నిక సంఘం సీరియస్ అయింది. పలు కేసులు నమోదు చేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలించారు. కాగా, పిన్నెల్లి ఈ కేసులో హైకోర్టు లో ముందస్తు బెయిల్ పొందారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ ఘటన పైన టీడీపీ నేతలు మండిపడ్డారు.

పవన్ మౌనం వెనుక
పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. కానీ, ఈ వ్యవహారం పైన జనసేనాని పవన్ స్పందించ లేదు. వైసీపీ నేత ఏకంగా ఈవీఎం ధ్వసం చేస్తూ వీడియో బయటకు వచ్చినా పవన్ స్పందించకపోవటం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీని వెనుక కారణాల పైన కొత్త చర్చ మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంస చేసిన సమయంలోనే టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేసారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి వైసీపీ వీడియోలు విడుదల చేసింది. వైసీపీ శ్రేణుల పైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన వీడియోలను బయట పెట్టింది.
అదేనా అసలు కారణం
దీంతో..పవన్ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని స్పందించటం ద్వారా టీడీపీ గురించి ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది. తెలుగు దేశ్ మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో రిగ్గింగ్ కు పాల్పడినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో..ఈ వివాదం పైన పవన్ స్పందించలేదని జనసేన వర్గాల సమాచారం. ఇక..జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపు పైన ఇప్పటికే పార్టీ నాయకత్వం సమీక్ష చేసింది. మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. జూన్ 4న కౌంటింగ్ కోసం తీసుకోవాల్సిన చర్చల పైన పార్టీ నేతలను నాయకత్వం అలర్ట్ చేసింది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications