పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
ఏపీలో ఎన్నికల వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు కూటమి తరఫున చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పవన్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో తరచూ పవన్ జ్వరంతో బాధపడుతున్నారు.
తరచూ జ్వరం వస్తుండటంతో పవన్ కళ్యాణ్ ప్రచారం, పర్యటనలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అసలే ఎన్నికల సమయం కావడంతో ప్రచారం వదిలి విశ్రాంతి తీసుకునే పరిస్ధితి కూడా ఉండటం లేదు. దీంతో జనసేన పార్టీ ఇవాళ తమ పార్టీ శ్రేణులు, నేతలు, పవన్ అభిమానులకు ఓ కీలక సూచన చేసింది. పవన్ వద్దకు వచ్చే వారు భారీ పూలదండలు తీసుకురావొద్దని సూచించింది. అలాగే క్రేన్ లో గజమాలలు కూడా ఏర్పాటు చేయొద్దని కోరింది.

పవన్ కళ్యాణ్ విజయభేరీ యాత్ర నేటి నుంచి నిరాటంకంగా కొనసాగుతుందని,రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరి రోజూ ఏదో ఒక సమయంలో జ్వరంతో ఆయన బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
పవన్ వద్దకు వచ్చే వారు కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని పార్టీ కోరింది. పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications