పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం, ఉంగుటూరు సభలు వాయిదా.. కారణమిదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అనేక అవాంతరాలను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యంతో బాధపడుతూ తన పర్యటనను వాయిదా వేస్తున్నారు. అది మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అడుగడుగున ఏదో ఒక రకంగా అవాంతరాలు వచ్చి పడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మరో అడ్డంకి ఎదురైంది. పవన్ కళ్యాణ్ ప్రయాణం చేయవలసిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ టేక్ ఆఫ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ను నిలిపివేశారు.

ప్రచార సభలకు వెళ్ళలేకపోయిన పవన్
ఇక పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నిలిచిపోవడంతో తాను వెళ్లవలసిన ప్రచార సభలకు వెళ్లలేకపోయారు. దీంతో పవన్ ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేశారు. ఇక ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించవలసి ఉంది. దీనికోసం పిఠాపురం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్టు అవాంతరం ఎదురైంది.
సభలు వాయిదా.. మళ్ళీ మరోరోజు సభలు
ఇక ఈ రెండు నియోజకవర్గాలలో సభలను వాయిదా వేసినట్టు మరొక రోజు ఇక్కడ సభలను నిర్వహించనున్నట్టు జనసేన పేర్కొంది ఒకవైపు పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో ప్రచారానికి బ్రేక్ పడుతుంటే మరోవైపు రకరకాల సాంకేతిక కారణాలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఇబ్బంది తలెత్తుతుంది.
అనారోగ్యంతో పాటు ఇతరత్రా ఇబ్బందులు కూడా
ఏది ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యంలోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తే అందుకు ఆయనకు హెలికాప్టర్ సాంకేతిక లోపం వంటి ఇతరత్రా కారణాలు కూడా సహకరించడం లేదు. దీంతో జనసేన పార్టీ నాయకులు తాజా పరిస్థితుల పట్ల కాస్త నిరాశతో ఉన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications