జనంలోకి జనసేనాని: ఉత్తారంధ్రకు పవన్, 9న ఒంగోలులో పడవ బాధితులకు పరామర్శ
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయన జనంలో ఉండనున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న ఆయన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న విషయం తెలిసిందే.
ఆయన బుధవారం నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాలు ఆయన విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

ఆ తర్వాత 9వ తేదీన ఒంగోలులో పర్యటిస్తారు. అక్కడ ఇటీవల కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. మూడు రోజులు ఉత్తరాంధ్రలో, ఓ రోజు ఒంగోలులో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications