చంద్రబాబుతో కాగిత వెంకట్రావు సమావేశం, మంత్రివర్గ సమావేశం వాయిదా
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమావేశమయ్యారు.పార్టీ అభివృద్ది కోసం పనిచేస్తానని కాగిత వెంకట్రావు ప్రకటించారు.పార్టీలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సద్దుమణుగుతాయ
అమరావతి:టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమావేశమయ్యారు.పార్టీ అభివృద్ది కోసం పనిచేస్తానని కాగిత వెంకట్రావు ప్రకటించారు.పార్టీలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సద్దుమణుగుతాయని మంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు.
మంత్రివర్గ విస్తరణలో కాగిత వెంకట్రావుకు మంత్రిపదవి దక్కలేదు.అయితే మంత్రిపదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు, పెడన బంద్ కు కూడ పిలుపునిచ్చారు.

అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో కాగిత వెంకట్రావు సోమవారం నాడు సమావేశమయ్యారు. మంత్రివర్గంలోకి కొందరిని తీసుకోవాలని మనసులో ఉన్నా కాని, మంత్రివర్గంలోకి తీసుకోలేని పరిస్థితి చంద్రబాబునాయుడుకు నెలకొందన్నారు కాగిత వెంకట్రావు.
పార్టీకి విధేయుడుగా, నమ్మకస్తుడిగా పనిచేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారని ఆయన చెప్పారు.అయితే కొన్ని కారణాల వల్లే మంత్రిపదవిని ఇవ్వలేకపోయినట్టుగా బాబు వివరించారని చెప్పారు.
కార్యకర్తలు ఇబ్బందులు పడినందునే తాను బాబును కలిశానని వెంకట్రావు చెప్పారు.అయితే పార్టీలో నెలకొన్న అసంతృప్తజ్వాలలు త్వరలోనే సమసిపోనున్నాయని కళా వెంకట్రావు చెప్పారు.ఇదిలా ఉంటే మంగళవారం నాడు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 6వ, తేదికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications