అలరించిన ఫొటో ఎగ్జిబిషన్: మట్టి గణపతులు(పిక్చర్స్
విశాఖపట్నం: నగరంలో బుధవారం నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్కు మంచి స్పందన లభించింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను విద్యార్థులు తలకించారు.
మాజీ మంత్రి బాలరాజు, ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తోపాటు ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పొన్ను స్వామి, అగర్వాల్లు ప్రదర్శనలో ఉంచిన ఫొటోలను చూసి ముగ్ధులయ్యారు. ఈ ఫొటోలు మన పరిస్థితిని మనం తెలుసుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. ఆనందం, ఆగ్రహం వంటి భావాలను వ్యక్తం చేయడానికి ఛాయాచిత్రాలు దోహదం చేస్తాయని ఫొటో గ్రాఫర్ పొన్ను స్వామి చెప్పారు.
ఆకట్టుకుంటున్న పర్యావరణ గణపతులు
విశాఖ నగరంలోని ఈస్ట్ పాయిట్ కాలనీలోని గాయత్రీ విద్యా పరిషత్ ఎంఎల్బి ట్రస్ట్ పాఠశాలలో బుధవారం మట్టి గణపతుల తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మట్టితో గణపతి ప్రతిమలను స్వయంగా తయారు చేశారు. అన్ని విగ్రహాలను మట్టితోనే తయారు చేయడం విశేషం.

ఫొటో ఎగ్జిబిషన్
విశాఖ నగరంలో బుధవారం నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్కు మంచి స్పందన లభించింది.

ఫొటో ఎగ్జిబిషన్
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను విద్యార్థులు తలకించారు.

మట్టి గణపతులు
విశాఖ నగరంలోని ఈస్ట్ పాయిట్ కాలనీలోని గాయత్రీ విద్యా పరిషత్ ఎంఎల్బి ట్రస్ట్ పాఠశాలలో బుధవారం మట్టి గణపతుల తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

మట్టి గణపతులు
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మట్టితో గణపతి ప్రతిమలను స్వయంగా తయారు చేశారు.

మట్టి గణపతులు
పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు అన్ని విగ్రహాలను పర్యావరణ హితమైన మట్టితోనే తయారు చేయడం విశేషం.












Click it and Unblock the Notifications