నిధుల కోసం బాబు ప్లాన్: జగ్గీ వాసుదేవ్, నిర్మలతో... (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆద్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న జగ్గీ వాసుదేవ్తో బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబును కలిశారు.
కాగా, లక్షల కోట్ల రూపాయలు సాధించేందుకు కోటి ఆశలతో చంద్రబాబు ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించుకునే ప్రయత్నాలు కూడా చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని కలవాలన్నది ఇదమిద్ధంగా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో సోమవారం జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
చంద్రబాబుతో నిర్మలా
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన దృశ్యం.
చంద్రబాబుతో నిర్మలా
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన దృశ్యం. పక్కన పరకాల ప్రభాకర్.
చంద్రబాబుతో నిర్మలా
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన దృశ్యం. పక్కన పరకాల ప్రభాకర్, అధికారులు.
చంద్రబాబుతో జగ్గీ వాసుదేవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.
చంద్రబాబుతో జగ్గీ వాసుదేవ్
ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆద్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న జగ్గీ వాసుదేవ్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
చంద్రబాబుతో జగ్గీ వాసుదేవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.
చంద్రబాబుతో జగ్గీ వాసుదేవ్
ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆద్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న జగ్గీ వాసుదేవ్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అనంతరం కొద్దిసేపు ఢిల్లీలోనే ఉండి మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరుతారు. ఆదివారం రాత్రిగానీ, సోమవారం ఆస్త్రేలియాతో జరిగే భేటీ అనంతరంగానీ కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో సింగపూర్ ప్రతినిధుల బృందంతో విమానంలోనే భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్కు వచ్చిన తరువాత మరోసారి విస్తృత స్థాయిలో సమావేశమవుతారని తెలుస్తోంది.
రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం కూడా బాగుంటుందని, అందువల్ల విభజనతో సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఉదారంగా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇదే కోణంలో కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాలని భావిస్తున్నట్లు సమాచారం.