రాజధాని: ఆమె రోడ్డెక్కింది! బాబుపై ఒత్తిడి (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమవ్యాప్తంగా డిమాండ్లు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
నీలం సంజీవ రెడ్డి మనవరాలు శ్యామలా రెడ్డి కూడా ఇందిరా పార్కు వద్ద శనివారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.

రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలులోనే నిర్మించాలనడంతో పాటు ఎనిమిది డిమాండ్లను శ్యామలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచారు.

రాజధాని
శివరామకృష్ణన్ కమిటీ ప్రజల శ్రేయస్సు గురించి, నారాయణ కమిటీ పెట్టుబడిదారుల స్వార్థం గురించి రాజధాని పైన ప్రకటనలు చేస్తోందని ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం.

రాజధాని
రాయలసీమ ద్రోహి చంద్రబాబు, నియంతగా మారిన ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల గురించి కానీ ప్రజల గురించి కాదని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

చంద్రబాబు
మరోవైపు, నూతన రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత, వాటిపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కొత్త రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ప్రకటించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌరసంఘాల నాయకులు వేరుగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు కూడా పాల్గొన్నాయి. తద్వారా రాజధాని కోసం చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications