రాజధాని: ఆమె రోడ్డెక్కింది! బాబుపై ఒత్తిడి (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమవ్యాప్తంగా డిమాండ్లు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
నీలం సంజీవ రెడ్డి మనవరాలు శ్యామలా రెడ్డి కూడా ఇందిరా పార్కు వద్ద శనివారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలులోనే నిర్మించాలనడంతో పాటు ఎనిమిది డిమాండ్లను శ్యామలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచారు.
రాజధాని
శివరామకృష్ణన్ కమిటీ ప్రజల శ్రేయస్సు గురించి, నారాయణ కమిటీ పెట్టుబడిదారుల స్వార్థం గురించి రాజధాని పైన ప్రకటనలు చేస్తోందని ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం.
రాజధాని
రాయలసీమ ద్రోహి చంద్రబాబు, నియంతగా మారిన ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల గురించి కానీ ప్రజల గురించి కాదని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.
చంద్రబాబు
మరోవైపు, నూతన రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత, వాటిపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కొత్త రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ప్రకటించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌరసంఘాల నాయకులు వేరుగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు కూడా పాల్గొన్నాయి. తద్వారా రాజధాని కోసం చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి.