బీజేపీతో మజ్లిస్ దోస్తీ: దిగ్విజయ్ సంచలనం (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం మజ్లిస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. బీజేపీ-మజ్లిస్ చేతులు కలిపాయని డిగ్గీ ఆరోపించారు. మజ్లిస్కు తలాఖ్ ఇచ్చేయాలని పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆయనను కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ ఆదివారం సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి దిగ్విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ ప్రసంగిస్తూ మైనారిటీ సమావేశాన్ని వచ్చేసారి హైదరాబాద్లోని పాతనగరంలో నిర్వహిస్తామన్నారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే హిందు-ముస్లింలు కలిసి ఉన్నారని, ఏపీలో ఇంతకాలం మజ్లిస్తో కలిసి పని చేశామని, అయితే మహారాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి వస్తే బీజపీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన మజ్లిస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారని ఆరోపించారు. దీంతో మజ్లిస్ పార్టీ బీజేపీతో ఒప్పందం చేసుకుందని తాను మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీపై ఆరోపణ చేస్తున్నానని డిగ్గీ అన్నారు.
డిగ్గీ
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హాజరయ్యేందుకు హైదరాబాదుకు వచ్చిన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తున్న దృశ్యం.
డిగ్గీ
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ ఆదివారం సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి దిగ్విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డిగ్గీ
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ప్రసంగిస్తూ మైనారిటీ సమావేశాన్ని వచ్చేసారి హైదరాబాద్లోని పాతనగరంలో నిర్వహిస్తామన్నారు.
సభ్యత్వ నమోదు
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఫోటోలు.
పొన్నాల
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య దృశ్యం.
దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ దృశ్యం.