మెన్స్ డే కోసం కవిత, లక్ష్మీప్రసన్న నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటి లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ హెడ్ కిర్షా రెడ్డిలు అధికారికంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి శనివారం కీలక సందేశాన్ని ప్రజలకు అందించారు.

ఐ యామ్ ఏ లేడీ
రోజువారి జీవనశైలి, ఒత్తిడి ఆరోగ్యపరంగా ముందుగా వచ్చే రుతువిరత, చికాకు పెట్టే పేగువ్యాధి, అలసట, చర్మ సమస్యలతో పాటు ప్రమాదభరితమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి.

ఐ యామ్ ఏ లేడీ
డాక్టర్ రూమ సిన్హా (గైనకాలజిస్ట్), డాక్టర్ ఆష సుబ్బలక్ష్మి (గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్), డాక్టర్ వినితా రెడ్డి (ఆంకాలజిస్ట్), డాక్టర్ పల్లవి రెడ్డి (డెర్మటాలజిస్ట్)లతో అపోలో హెల్త్ సిటీకి చెందిన ప్రఖ్యాత వైద్య బృందం ఇటువంటి పలురకాల సమస్యలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ఐ యామ్ ఏ లేడీ
శ్రీమతి విజయ తుపురాణిచే నిర్వహించబడిన జుంబ సదస్సు, ఆరోగ్యకరమైన భోజనంపై ప్రదర్శింపబడిన గుడ్ మీల్ డెమోను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

ఐ యామ్ ఏ లేడీ
ఈ కార్యక్రమంలో ఔత్సాహికుల కొరకు ఫోటోగ్రఫీ, కళా ప్రదర్సన, సాధారణ పెయింటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి. కార్యక్రమంలో మహిళా సృజనాత్మకత, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీమతి లూణ లోగన్చే ఏర్పాటైన ఫోటోగ్రఫీ, కళా ప్రదర్శన మహిళలచే గొప్ప ఆధరణను అందుకున్నాయి.

ఐ యామ్ ఏ లేడీ
సంగీతా రెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైన విషయం, ఈ కార్యక్రమం మహిళల యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉద్దేశిస్తోందన్నారు.

ఐ యామ్ ఏ లేడీ
ఐ యామ్ ఏ లేడీ అనబడే ఆన్ లైన్ పోర్టల్ మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందని, ఈ పోర్టల్ వివిధ రంగాలకు చెందిన మహిళల వ్యక్తపరిచే ఆలోచనలు, కళలు, ఆశయం ప్రయోజనాలు, ఆందోళనలకు ఒక వేదికవుతుందని చెప్పారు.

ఐ యామ్ ఏ లేడీ
చైనాలో శిశు మరణాల సంఖ్య 6000 కాగా, మన దేశంలో 56000గా ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సంగీతా రెడ్డి అన్నారు.

ఐ యామ్ ఏ లేడీ
మంచు లక్ష్మీ మాట్లాడుతూ... మనం కోరుకునే మార్పును, పర్యావరణంలో మన కుటుంబాలు తీసుకు వచ్చే మార్పు ద్వారా సాధించవచ్చునని, సమాజంలో వచ్చే ఈ మార్పును మనం గమనించవచ్చునని చెప్పారు.

ఐ యామ్ ఏ లేడీ
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం మహిళలు మాత్రమే మహిళా దినోత్సవాన్ని ఎందుకు కలిగి ఉండాలని, పురుషులు కూడా పురుషుల దినోత్సవాన్ని కలిగి ఉండాలని, ప్రతిరోజు పురుషులదే పైచేయి అవుతుండటంతో మహిళలకు ఒకే ఒకరోజు కేటాయించబడిందన్నారు.

ఐ యామ్ ఏ లేడీ
ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications