కేసీఆర్పై కిషన్ రెడ్డికి ఓయు విద్యార్థులు... (పిక్చర్స్)
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏజో రోజుకు చేరుకుంది. దీక్షలో పాల్గొన్న విద్యార్థులకు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రమబద్ధీకరణ అనేది గెజిటెడ్ ఉద్యోగాల విషయంలో సాధ్యం కాని విషయమని, అయితే సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అసలు విషయాలు గ్రహించాలన్నారు. దీనిపై ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని నియమించి సాధ్యాసాధ్యాలపై చర్చించాలే తప్ప ఇలా వాగ్దానాలు చేసి మోసం చేయవద్దన్నారు. ప్రభుత్వం వెంటనే టీపీఎస్సీని ఏర్పాటు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. అనంతరం అన్ని విద్యార్థి సంఘాలతో కూడిన ఒక బృందం రాజకీయ పార్టీల నాయకులకు వినతి పత్రాలు అందజేసి తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరినట్లు చెప్పారు.

కిషన్ రెడ్డితో ఓయు విద్యార్థులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పలువురు బుధవారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు.

కిషన్ రెడ్డితో ఓయు విద్యార్థులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పలువురు బుధవారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను వ్యతిరేకించాలని కోరారు.

కిషన్ రెడ్డితో ఓయు విద్యార్థులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పలువురు బుధవారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిశారు.

బీజేపీ
మరోవైపు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పదాధికారుల సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు.

కిషన్ రెడ్డి
మరోవైపు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పదాధికారుల సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నకిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి
మరోవైపు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పదాధికారుల సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నకిషన్ రెడ్డి.












Click it and Unblock the Notifications