ఏపీ కాంగ్రెస్ ఆఫీస్లో పొన్నాల, ముచ్చట్లు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీకి అధ్యక్షులుగా పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ చీఫ్గా రఘువీరా రెడ్డి ఉన్నారు.
గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు, ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి.
కాగా, మంగళవారం తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇందిరా భవన్ వెళ్లి.. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో కాసేపు ముచ్చటించారు.

తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు
ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య.

రఘువీరా రెడ్డి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు వంద రోజుల పాలనలో 101 పర్యాయాలు మాట మార్చారని, అబద్దాలు చెప్పారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు.

రఘువీరా రెడ్డి
చంద్రబాబు వంద రోజుల పాలనలో అర చేతిలో వైకుంఠం చూపించారన్నారు. ‘డాబుల బాబు - వంద రోజుల పాలన'పై రూపొందించిన వాస్తవ పత్రాన్ని రఘువీరా రెడ్డి సోమవారం ఇందిరా భవన్లో విడుదల చేశారు.

పల్లె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications