జానా రిటైర్ కావాలనుకొని.., వెనుకాడం (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయల నుండి రిటైర్ అవ్వాలనుకున్నానని కానీ, కాంగ్రెసు పార్టీ కష్టకాలంలో ఉందని ఆగిపోయానని చెప్పారు. బుధవారం సిఎల్పీ సమావేశమైంది.
సిఎల్పీ పలు తీర్మానాలు చేసింది. తెరాస ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సిందేనని, ప్రతిపక్ష బాధ్యతగా దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందేనని టి కాంగ్రెస్ శాసనసభాపక్షం తీర్మానించింది.
జానారెడ్డి నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత డి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సిఎల్పీ
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయల నుండి రిటైర్ అవ్వాలనుకున్నానని కానీ, కాంగ్రెసు పార్టీ కష్టకాలంలో ఉందని ఆగిపోయానని చెప్పారు. బుధవారం సిఎల్పీ సమావేశమైంది.

సిఎల్పీ
సిఎల్పీ పలు తీర్మానాలు చేసింది. తెరాస ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సిందేనని, ప్రతిపక్ష బాధ్యతగా దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందేనని టి కాంగ్రెస్ శాసనసభాపక్షం తీర్మానించింది.

సిఎల్పీ
జానారెడ్డి నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత డి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సిఎల్పీ
ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడటంలో ఏమాత్రం వెనకాడవద్దని పిలుపునిచ్చారు.

సిఎల్పీ
అయితే ఇప్పుడే తొందర పాటును ప్రదర్శించినట్లుగా కాకుండా కొంత సంయమనంతో వ్యవహరిద్దామని సూచించారు. ఇదే సమయంలో తాను కెసిఆర్తో కుమ్మక్కు అయ్యానన్న అపోహ ఉందని, అలాంటిదేమీ లేదన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుదామని అనుకున్నానని కానీ, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోవడం సరికాదని భావించానని, పార్టీని గాడిలో పెట్టేంత వరకూ పార్టీలో కొనసాగాలని నిర్ణయించానని చెప్పారు.

సిఎల్పీ
కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బాధ్యత వహించలేదని, పైగా సీఎల్పీ సమావేశానికి వచ్చారని, ఆయన సమక్షంలో జరిగిన సమావేశాన్ని నిరసిస్తూ తాను వాకౌట్ చేశానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications