సోనియా విగ్రహం వద్ద టి ఆనందం, స్టెప్పులు (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున ప్రదేశ్ కాంగ్రెసు కమిటి కార్యదర్శి దిలీపాచారి ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో తెలంగాణ జాతర, సోనియా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
దీనికే కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు, రాపోలు ఆనంద భాస్కర్, శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఆదివారం ఆవిష్కరించిన ఈ సోనియా గాంధీ విగ్రహాన్ని తెలంగాణ జిల్లాల్లో ఊరేగించి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులో ప్రతిష్టిస్తారు.
విహెచ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోరు తెరిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అబద్దాలే చెబుతున్నారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు విమర్శించారు.
సోనియా గాంధీ
సోనియా గాంధీ విగ్రహాన్ని నాగర్ కర్నూలులో ప్రతిష్టించేందుకు పార్టీ నాయకుడు దిలీప్ సాగర్ ఏర్పాటు చేయించిన విగ్రహాన్ని ఆదివారం గిరిజన మహిళలతో ఇందిరా పార్కు వద్ద ఆవిష్కరింపజేశారు.
విహెచ్ 2
విహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఇక్కడే పెరిగినా ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు.
విహెచ్ 3
తెలంగాణకు సహకరించమని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు తన కుమారుడు నాదెండ్ల మనోహర్కు చెప్పాలని వి హనుమంత రావు కోరారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు, రాపోలు ఆనంద భాస్కర్, శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
సోనియా గాంధీ
ఆదివారం ఆవిష్కరించిన ఈ సోనియా గాంధీ విగ్రహాన్ని తెలంగాణ జిల్లాల్లో ఊరేగించి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులో ప్రతిష్టిస్తారు.
సర్వే
కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక ఎవరూ ఆపలేరని తెలిపారు.
జై తెలంగాణ
ఆదివారం ఆవిష్కరించిన ఈ సోనియా గాంధీ విగ్రహాన్ని తెలంగాణ జిల్లాల్లో ఊరేగించి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులో ప్రతిష్టిస్తారు. విగ్రహం వద్ద జై తెలంగాణ నినాదాలు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు, రాపోలు ఆనంద భాస్కర్, శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.