సింహపురిగా మారుస్తాం!: వెంకయ్య (పిక్చర్స్)
నెల్లూరు: ప్రజలు అంగీకరిస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరును సింహపురిగా మారుస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు.
నెల్లూరు నగరంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహావిష్కరణలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విక్రమ సింహపురిగా నామకరణం చేస్తామన్నాుర.
నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడంతో పాటు భారత యూనియన్లను ఐక్యం చేయడంలో కీలకపాత్ర పోషిచిన పటేల్కు జీవితకాలంలో గానీ, తర్వాత గానీ ఆయనకు సరైన న్యాయం జరగలేదన్నారు.

వెంకయ్య
ప్రజలు అంగీకరిస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరును సింహపురిగా మారుస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు.

వెంకయ్య
ఆయన మరణం తర్వాత 41 ఏళ్లకు సర్దార్ పటేల్కు భారతరత్న అవార్డు ప్రదానం చేశారని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా అన్నారు.

వెంకయ్య
స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సమరయోధులందరికీ సమాన గౌరవం ఇవ్వాలని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.

వెంకయ్య
జాతిపిత మహాత్మా గాంధీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి సహచరుడని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

వెంకయ్య
తనకు ప్రజల మద్దతు ఉన్నా. గాంధీజీ ఆకాంక్షల మేరకు జాతి ప్రయోజనాల కోసం పండిట్ నెహ్రూ ఆధ్వర్యంలో పని చేసేందుకు పటేల్ సిద్దపడ్డారని కొనియాడారు.












Click it and Unblock the Notifications