రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు (పిక్చర్స్)
విజయనగరం: ఆదాయానికి మించి ఉన్న రైతు, డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేస్తారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అలాంటప్పుడు ఆదాయానికి మించిన అప్పులను బాబు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.
మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన రోడ్షోలో.. అనంతరం జాతీయరహదారి, ప్రధాన కూడలిలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల గృహాలుండగా ఇంటింటికీ ఉద్యోగం ఎలా ఇస్తారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే తాను సిఎంగా ఐదేళ్లతో 50 లక్షల పక్కా గృహాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలను ఇంగ్లీషు మీడియం పాఠశాలగా మారుస్తానని చెప్పారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
మహిళలకు వెన్నుదన్నుగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబులా టీవీ, సెల్ఫోన్ , కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పనని, కానీ, ప్రతి ఇంట్లో 150 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.100 మాత్రమే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
పగటి పూట రైతుకు ఏడుగంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆచరణయోగ్యమైన హామీలనే తమ పార్టీ ఇస్తోందన్నారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
మనమంతా రాముని పాలన చూడలేదు గానీ, ఆ పాలన తాను తీసుకు వస్తానని స్పష్టం చేశారు. జగన్ పార్టీని ఆదరించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపై తాను పెట్టబోయే ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మార్చివేస్తానని వైయస్ జగన్ ఈ సందర్భంగా చెప్పారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనం భారీగా తరలి వచ్చారు. జగన్ పర్యటిస్తున్న దారుల్లో ప్రజలు క్యూ కడుతున్నారు. జగన్తో చేతులు కలిపేందుకు అభిమానులు ఎగబడ్డారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
ఆదాయానికి మించి ఉన్న రైతు, డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేస్తారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అలాంటప్పుడు ఆదాయానికి మించిన అప్పులను బాబు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.

రివర్స్: జగన్కే ఓదార్పు, వారు పోటీ పడ్డారు
మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన రోడ్షోలో.. అనంతరం జాతీయరహదారి, ప్రధాన కూడలిలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల గృహాలుండగా ఇంటింటికీ ఉద్యోగం ఎలా ఇస్తారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications