చంద్రబాబు అంతా చూశారు, ఆగ్రహించారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం సచివాలయంలోని ఎల్బ్లాక్ను పరిశీలించిన చంద్రబాబు ఎనిమిదో అంతస్థులో ఉన్న తన చాంబర్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సచివాలయంలోని వివిధ విభాగాలను బాబు పరిశీలించారు. ఏపీ సచివాలయంలో పరిస్థితిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. సచివాలయంలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు.చాలా గదులకు తాళాలు వేసి ఉన్నాయని, కొన్ని గదులకు తానే తాళాలు తీయించానని ఆయన తెలిపారు.
ఎల్బ్లాక్ను పరిశీలించిన అనంతరం సచివాలయ పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చంద్రబాబు భేటీ అయ్యారు.
చంద్రబాబుకు స్వాగతం
సచివాలయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్ఛంతో ఇలా స్వాగతం పలికారు.
చంద్రబాబు ఇలా..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని వసతుల పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఛాంబర్ పనులను అడిగి తెలుసుకున్నారు.
ఇలా తొంగి చూశారు..
సచివాలయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిబ్బంది ఇలా కిటికీల్లోంచి తొంగిచూశారు.
అంతా కలియదిరిగారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం కలియదిరిగి చూశారు. కొన్ని గదులకు తాళాలు వేసి ఉన్నాయని, తానే తెరిచానని చెప్పారు.
ఇది రెండో సారి...
పదవీబాధ్యతలు స్వీకరించడానికి సచివాలయం వచ్చిన చంద్రబాబు శుక్రవారం రెండోసారి అందులో అడుగు పెట్టారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
సచివాలయంలో
కార్యాలయాలు
కేటాయించి
నెల
రోజులుగా
గడుస్తున్నా
సౌకర్యాలు
లేకపోవడంపట్ల
అధికారులపై
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
చక్కదిద్దండి
త్వరగా పనులను చక్కదిద్దాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇంకా అలాగే ఉండడమేమిటని అడిగారు.
చర్యలు తీసుకుంటాం
అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.