అసద్తో కెసిఆర్ ఆలింగనం, హరికృష్ణ భేటీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పలువురు కలుస్తున్నారు. సీమాంధ్రకు చెందిన సినీ నటులు, కళాకారులు కూడా ఆయనను కలవడం విశేషం.
తాజాగా గురువారంనాడు కెసిఆర్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బావమరిది, రాజ్యసభ మాజీ సభ్యుడు హరికృష్ణ తన కుమారుడు కళ్యాణ్ రామ్తో కలిసి కెసిఆర్తో భేటీ అయ్యారు.
మజ్లీస్ బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కెసిఆర్ను కలిశారు. తెరాస ప్రభుత్వంలో చేరే ఆలోచన లేదని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో తమ కోర్కెల చిట్టాను ఆయన విప్పారు.
కెసిఆర్తో మహంతి ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు.
కెసిఆర్తో హరికృష్ణ భేటీ
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బావమరిది హరికృష్ణ కలిశారు. ఆయనతో పాటు కుమారుడు, హీరో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.
దోస్త్ మేరా..
మజ్లీస్తో కెసిఆర్ స్నేహాన్ని కోరుకుంటున్నారు. మజ్లీస్ అధినేత అసదుద్దీిన్ ఓవైసీ తన నివాసానికి వచ్చినప్పుడు కెసిఆర్ ఆలింగనం చేసుకున్నారు.
అక్బరుద్దీన్తో కరచాలనం
మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీతో కెసిఆర్ కరచాలనం చేశారు. కెసిఆర్ మజ్లీస్ బ్రదర్స్ స్నేహాన్ని కోరుకుంటున్నారు.
ఓవైసీ బ్రదర్స్ భేటీ
ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కెసిఆర్తో చర్చలు జరిపారు. తెలంగాణకు, హైదరాబాద్కు చేయాల్సిన పనుల గురించి చెప్పారు.