కొత్త వాచీలతో మంచు లక్ష్మి హల్చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ స్విస్ వాచీ తయారీ సంస్థ కొత్తగా రూపొందించిన ఎలిగెంట్ కలెక్షన్ను మొదటిసారిగా హైదరాబాద్లో ఆవిష్కరించారు. సినీ నటి మంచు లక్ష్మి ప్రసన్న వాటిని ఆవిష్కరించారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో గల లాంజిన్స్ బొటెక్లో శక్రవారంనాడు ఆమె ఈ కొత్త కలెక్షన్లను విడుదల చేశారు.
ఈ కలెక్షన్లను ఇక్కడ ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, లాంజిన్స్ మోస్ట్ లేడీ అవార్డును తను అందుకోవడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందని ఆమె అన్నారు. సంస్థ స్పోక్స్ పర్సన్ వేణు కూడా మాట్లాడారు.
క్లాసికల్ డిజైన్స్కు ఖ్యాతి గడించిన తాము ఈ కొత్త కలెక్షన్లను మేూడు సైజుల్లో తెచ్చినట్లు ఆయన తెలిపారు. సెల్ఫ్ వైండింగ్, మెకానికల్ మూవ్మెంట్ సమ్మేళనంతో వాటిని తెచ్చినట్లు చెప్పారు. వీటి ధర 92 వేల 500 రూపాయల నుంచి 2 లక్షల 34 వేల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు.
కొత్త వాచీలతో మంచు లక్ష్మి
స్విస్ కంపెనీ రూపొందించిన ఎలిగెంట్ కలెక్షన్ వాచీలను ప్రముఖ నటి మంచు లక్ష్మి హైదరాబాదులో ఆవిష్కరించారు.
కొత్తవాచీలతో మంచు లక్ష్మి
కొత్త వాచీలను ఆవిష్కరించిన ప్రముఖ సినీ నటి మంచు ప్రసన్న లక్ష్మి వాటితో సందడి చేశారు.
కొత్త వాచీలతో మంచు లక్ష్మి
స్విస్ వాచీల కంపెనీ రూపొందించిన నూతన కలెక్షన్ను ఆవిష్కరించిన మంచు లక్ష్మి ఇలా గ్రూప్ ఫొటోలో కనిపించారు.
కొత్త వాచీలతో మంచు లక్ష్మి
స్విస్ వాచీల కంపెనీ రూపొందించిన నూతన కలెక్షన్ను తొలిసారి భారతదేశంలో హైదరాబాదులో విడుదల చేశారు. మంచు లక్ష్మి చేతుల మీదుగా అవి విడుదలయ్యాయి.