అమ్మాయిలు గొడుగు, స్త్రీలు ఎత్తిపోశారు (పిక్చర్స్)
విశాఖపట్నం: గురువారం రాత్రి విశాఖపట్నంలో భారీ వర్షం పడింది. తెల్లారేసరికి కూడా వాన వదలలేదు. జనం బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నంలో గురు, శుక్రవారాల్లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్, అల్లిపురం, మద్దిలపాలెం, వన్ టౌన్, జగదాంబ, చిన వాల్తేరు తదితర ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వేళల్లో కళకళలాడే ఆర్కె బీచ్, వైఎంసిఎ వంటి సాగర తీర ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి.
పలు ప్రాంతాల్లోని మురుగు కాలువలు, వన్ టౌన్లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీలు పొంగి మురుగు నీరు రహదారులపైకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది.
స్కూలు పిల్లలు..
విశాఖపట్నంలో గురు, శుక్రవారాల్లో కురిసిన వానకు పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది స్కూలు పిల్లలు రెయిన్ కోట్లతో కనిపించారు.
ఇలా నిండిపోయింది...
వర్షం నీటికి విశాఖపట్నంలోని వీధులు జలమయం అయ్యాయి. క్వీన్ మేరీ హైస్కూల్ వద్ద నీరు ఇలా పొంగిపొర్లింది.
గొడుగులతో యువతులు..
విశాఖఫట్నంలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షం పడింది. దీంతో యువతులు రంగురంగుల గొడుగులతో కనువిందు చేశారు.
నీళ్లు ఎత్తిపోసుకున్నారు..
విశాఖపట్నంలో భారీ వర్షం పడింది. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ఇళ్లలోకి చేరిన నీరు ఇలా తోడేసుకున్నారు.
నీళ్లు ఎత్తిపోస్తూ...
ఇంటిలోకి చేరిన నీటిని ఓ మహిళ ఇలా ఎత్తిపోస్తూ కనిపించింది. ఇళ్లలోకి కూడా నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఆరు బయట వ్యాపారాలు బంద్
కుటుంబంతో టూ వీలర్పై వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆరు బయట వ్యాపారాలన్నీ శుక్రవారం ఉదయం మూతపడ్డాయి. సాయంత్రం తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఊరట పొందారు.