బియాస్ ట్రాజెడీ: ఆరని శోకం, అక్కడే మంత్రి (పిక్చర్స్)
హైదరాబాద్/ మండ : హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం మరో మూడు విద్యార్థుల మృత దేహాలు లభ్యమయ్యాయి.
గురువారం ఒక విద్యార్థి మృత దేహం లభ్యమయ్యింది. విద్యార్థి శివప్రసాద్గా అధికారులు గుర్తించారు. మధ్యాహ్రం మరో మృత దేహం లభ్యమైంది. విద్యార్థి ఆశిష్మంతా మృతదేహంగా అధికారులు గుర్తించారు. గురువారం సాయంత్రం మరో మృత దేహం లభ్యమైంది. విద్యార్థి మాచర్ల అఖిల్గా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 12 మృత దేహాలు లభ్యమయ్యాయి.
ఇంకా 12 మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు హైదరాబాద్కు పంపనున్నారు. కాగా, తరుణ్ మృతదేహం హైదరాబాదులోని మియాపూర్కు చేరుకుంది.
తరుణ్ మృతదేహం
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ ప్రమాదంలో మరణించిన తరుణ్ మృతదేహం హైదరాబాదులోని మియాపూర్కు చేరుకుంది.
తరుణ్ మృతదేహం
బియాస్ నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విఎన్నార్ కాలేజీ విద్యార్థి తరుణ్ మృతదేహం హైదరాబాదు చేరుకుంది.
తరుణ్ మృతదేహం
బియాస్ నదీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తరుణ్ మృతదేహం ఎట్టకేలకు దొరికింది. దుఖ్కం గడ్డకట్టుకుపోయే ఉంటుంది.
తరుణ్ మృతదేహం
బియాస్ ప్రమాదం బాధ తీరేది, ఆరేది కాదు. ఒక్కరా ఇద్దరా 24 మంది విద్యార్థుల ప్రాణాలు నది పాలయ్యాయి. వారిలో తరుణ్ ఒక్కడు.
తరుణ్ మృతదేహం
బియాస్ నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన తరుణ్ మృతదేహం హైదరాబాదులోని మియాపూర్ చేరుకుంది.
తరుణ్ మృతదేహం
బియాస్ నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన తరుణ్ కుటుంబ సభ్యుల శోకం ఆరేది, తీరేది కాదు.
పాండో వద్ద మహేందర్ రెడ్డి
బియాస్ నదిలో కొట్టుకుపోయిన మరో 12 మంది విన్నార్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలను తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి పాండో డ్యాం వద్ద పర్యవేక్షిస్తున్నారు.
పాండో డ్యామ్ వద్ద మహేందర్ రెడ్డి
తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాండో డ్యామ్ వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.