మృత్యు మార్గం: ఔటర్పై మృతులు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఆగడం లేదు. హైదరాబాదులోని
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి తిరిగి గుంటూరు వెళుతుండగా తుక్కుగూడ ఔటర్ రింగ్రోడ్డుపై డివైడర్ను ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన మల్లికార్జున్రెడ్డి (53) తన తల్లి బస్వమ్మ (75) అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో గురువారం తల్లితో పాటు బంధువు బాలకృష్ణారెడ్డి (29)తో కలిసి మధ్యాహ్నం కారులో గుంటూరు బయలుదేరారు. బాలకృష్ణారెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా, మల్లికార్జున్రెడ్డి, బస్వమ్మ వెనుక కూర్చున్నారు.
తుక్కుగూడలోని ఔటర్ రింగ్రోడ్డుపై గల ఎక్సిట్ 14 వద్ద కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను బయటికి తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కారు డ్రైవర్ చేస్తూ మృతి
కారు డ్రైవర్ చేస్తున్న బాలకృష్ణా రెడ్డి హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారు డివైడర్ను ఢీకొట్టి ప్రమాదం జరిగింది.

ఓ మహిళ మృతి
హైదరాబాదు రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జునమ్మ నిమ్స్లో చికిత్స పొంది తిరిగి వెళ్తుండగా మరణించింది.

మల్లికార్జున రెడ్డి మృతి
తన తల్లి బస్వమ్మకు హైదరాబాదు నిమ్స్లో చికిత్స చేయించి తీసుకుని వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించాడు.

కారు నుజ్జు నుజ్జు
హైదరాబాద్ రింగ్ రోడ్డుపై తుక్కుగుడా వద్ద కారు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కు అయింది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications