Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాచర్ల ఈవీఎంల ధ్వంసం కేసులో ఏ1గా పిన్నెల్లి.. అరెస్ట్ పై ఈసీకి డీజీపీ కీలకనివేదిక!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మాచర్లలో పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎం, వీవీ ప్యాట్ మిషన్ లను ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. తక్షణం ఆయనను అరెస్టు చేయాలని, అరెస్ట్ పై నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల కమీషన్ కు డీజీపీ కీలక నివేదిక
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా ద్వారా కీలక నివేదికను ఎన్నికల కమిషన్ కు అందజేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో తీసుకున్న చర్యలపైన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు.

Pinnelli ramakrishna reddy as A1 in EVMs vandalism case AP DGP key report to EC on his arrest

పిన్నెల్లి అరెస్ట్ కు తీసుకున్న చర్యలపై నివేదిక
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పలు సెక్షన్ల కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆయన పైన నమోదు చేస్తున్న సెక్షన్ల వివరాలను కూడా వెల్లడించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పాలన విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు.

ఈవీఎం ధ్వంసం కేసులో ఏ వన్ గా పిన్నెల్లి
లుక్ అవుట్ సర్క్యులర్ ను కూడా జారీ చేశామని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం తెలంగాణలో సెర్చ్ కొనసాగుతుందని, దొరకగానే అరెస్టు చేస్తామని డిజిపి పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణలపై సిట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నామని డిజిపి వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ లను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవన్ గా చేర్చామని డిజిపి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

పిన్నెల్లి అరెస్ట్ ను ధృవీకరించని పోలీసులు
ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు ఆయన అరెస్టును ధ్రువీకరించలేదు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు తెలంగాణలో వేట కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. ఏపీ నుండి వెళ్ళిన ప్రత్యేక బృందాలు, తెలంగాణా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఎన్నికల కమిషన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం పిన్నెల్లి విషయంలో డిజిపి చర్యలకు దిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+