‘రాష్ట్రంలో పవన్ పార్టీ జెండానే లేదు..! జగనే మా ప్రత్యర్థి’
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ జెండానే లేదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
పశ్చిమగోదావరి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ జెండానే లేదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

పవన్ కాదు.. జగనే
గురువారం మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణ బద్ధంగా పవన్ ఆలోచించడం లేదని అన్నారు. పవన్ గురించి ఆలోచించే సమయం తమకు లేదని చెప్పారు. తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీనేనని మంత్రి పితాని పేర్కొన్నారు.
Recommended Video


జగన్కు మంచి బుద్ధి వస్తుంది..
ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చిన్న జీయర్ స్వామిని కలుసుకుని ఆశీస్సులు తీసుకోవడంపై మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. జగన్ స్వామీజీలను కలవడం, దీవెనలు పొందడం మంచిదేనంటూ, అప్పుడైనా జగన్కు మంచి బుద్ధి వస్తుందని అయ్యన్న వ్యాఖ్యానించారు.

కుల గజ్జిని అంటగడుతున్నారు..
ఎందుకంటే.. ప్రతి ఒక్కరికి దైవబలం అవసరమన్నారు మంత్రి. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో మహనీయులకు కూడా కుల గజ్జిని అంటకడుతున్నారని మంత్రి అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి..
మహనీయులను అందరివారిగా గుర్తించాలని, మహనీయుల గురించి మాట్లాడే ముందు అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications