PM Kisan - అన్నదాత సుఖీభవ నిధుల జమ పై కీలక అప్డేట్, ఖాతాల్లో రూ 6 వేలు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ పైన బిగ్ అప్డేట్. 24వ విడత నిధుల జమ పైన కసరత్తు జరుగుతోంది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల పైనా రైతులకు కీలక సమాచారం అందిస్తున్నారు.
పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో అక్టోబర్ తొలి వారంలో ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

రైతులకు కీలక సూచనలు
రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులుఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. గత ఏడాదిన్నార కాలంగా కేంద్ర నిధులతో పాటుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. కేంద్రం ఇచ్చే రూ 6 వేలతో పాటుగా ఏపీ ప్రభుత్వం రూ 14 వేలు అందిస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు వచ్చే నెల అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం అందించే రూ 6 వేలు ఒకే విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications