ఏపీలో మోడీ టూర్ షెడ్యూల్ మార్పు- కొత్త తేదీలివే..!
ఏపీలో ఎన్డీయే పార్టీల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. అయితే ప్రధాని పర్యటన షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ప్రధాని తన ప్రచారంలో భాగంగా నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ప్రధాని మోడీ వచ్చే నెల 3, 4 తేదీల్లో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. విజయవాడ, అనకాపల్లి, రాజమండ్రి, పీలేరు సభల్లో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు మారిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ.. రాష్ట్రంలో ఈ మేరకు తన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్డీయే కూటమి ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలో ఇప్పటికే ఓసారి ప్రధాని మోడీ పర్యటించారు. పల్నాడులోని చిలకలూరిపేట వద్ద జరిగిన ఎన్డీయే కూటమి సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు మే 7,8 తేదీల్లో సభలు నిర్వహించడం ద్వారా ఎన్నికల పోలింగ్ తేదీ కంటే ముందే ప్రచారం చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉత్తరాదిలో కూడా ప్రధాన రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుంది.
-
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications