Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ-గూడూరు రైల్వేలైన్‌ నిర్మాణం: పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా

Recommended Video

    దేశంలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా...!

    అమరావతి: విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్‌ నిర్మాణం విషయమై రైల్వేబోర్డు చైర్మన్‌ అశ్వని లోహానీ ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రైల్వే లైన్‌ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని లోహాని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తెలిపారు. ఏపీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ భూమి, ఇతర భూసేకరణ వివరాలను ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ప్రధానికి తెలిపారు.

    PM Modi enquired progress of Vijayawada-Gudur third railway line works progress

    దేశంలో ప్రధాన రైల్వే మార్గమైన కలకత్తా- మద్రాసు మార్గానికి రెండు లైన్లు ఉండటం చేత ప్రధానంగా రైల్వేకి ఆదాయం సమకూర్చే గూడ్స్‌ రైళ్లను సకాలంలో గమ్యానికి పంపడం తలకు మించిన భారంగా మారింది. దీనికి పరిష్కారంగా మూడో లైను నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. దీంతో విజయవాడ-గూడూరు మధ్య మూడవ లైను ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది.

    ఈ ప్రాంతం నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ఉండటంతో రాజధాని అమరావతికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెరిగేలా హౌరా - చెన్నై ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎన్నో ఏళ్ల నుంచి భావిస్తున్నారు.

    ఈ మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.

    ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు ఆవశ్యం.

    అనంతరం ఆ తరువాత ఎన్నోర్-తిరువళ్లూర్-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మదురై-టూటికోరన్ గ్యాస్ పైప్ లైన్ గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంఎం కుట్టీ ప్రధాని మోడీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 1244 కిలోమీటర్ల పొడవున ఈ పైప్ లైన్ నిర్మిస్తారని చెప్పారు. ఈ పైప్ లైన్ ని 5 దశలలో నిర్మిస్తారని, ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూమికి సంబంధిచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+