HBD YSJagan ప్రధాని మోదీ - ప్రముఖుల విషెస్ : సోషల్ మీడియా షేకింగ్..!!
HBD YSJagan:ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోదీ విషెస్ చెప్పారు. సీఎం జగన్ జన్మదినం కావటంతో ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ ను శుభాకాంక్షలు చెప్పారు. సంతోషంగా జీవించాలని ఆకాక్షించారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఎంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు. హీరో నాగార్జున ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2022
Hearty Greetings to Hon'ble Chief Minister of Andhra Pradesh Thiru. @ysjagan on his 50th Birthday.
— M.K.Stalin (@mkstalin) December 21, 2022
Wishing you peace, good health and happiness always on this special day.
ముఖ్యమంత్రి జన్మదినం కావటంతో ఆయన అభిమానులు..వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్త దానం.. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు. ఇక, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ విషెస్ హోరెత్తుతున్నాయి. #HBD YSJagan టాగ్ లో ట్విట్టర్ హోరెత్తుతోంది.

ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఇక, పార్టీ నేతలు నియోజవర్గాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ బాపట్ల చేరుకున్నారు. అక్కడ 8వ తరగతి విద్యార్ధులకు ఉచిత ట్యాబ్ లు పంపిణీ సీఎం ప్రారంభించనున్నారు. బైజూస్ కంటెంట్ తో పాటుగా ఈ టాబ్ లను అందిస్తున్నారు.
Birthday greetings to the Chief Minister of Andhra Pradesh Shri @ysjagan ji. May you be blessed with good health and long life.
— Nitin Gadkari (@nitin_gadkari) December 21, 2022
Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022
పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం జన్మదిన వేడకలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా జగన్ తాను చేసింది ప్రజలకు వివరిస్తూ..తాను చేసిన మంచి నచ్చితేనే ఓట్లు వేయమని ధైర్యం చెప్పగలిగిన నేతగా అభివర్ణించారు. జగన్ చిరస్థాయిగా నిలిచిపోవాలని సజ్జల ఆకాంక్షించారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ద్వారా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అదే విధంగా పలు జిల్లాల్లో మూడు రోజులుగా వైఎస్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సేవా కార్యక్రమాలతో పాటుగా పోటీలు నిర్వహించారు.
-
Tamil Nadu: తమిళనాట నిరసనలకు స్టాలిన్ పిలుపు..! నిప్పుతో ఆడుకోవద్దని వార్నింగ్..! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications