వ్యతిరేకిస్తాం, పోలవరం డిజైన్ మార్చాలి: ప్రకాష్ కారత్
విజయవాడ: ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాజెక్టు నమూనాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనీ సిపిఎం జాతీయ నాయకుడు ప్రకాష్ కారత్ చెప్పారు. వెంటనే పోలవరం ప్రాజెక్టు కొత్త డిజైన్ చేపట్టాలని ఆయన సూచించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
నీరు, విద్యుత్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణం చర్చించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన తప్పుపట్టారు. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేలా మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని ప్రకాష్ కారత్ విమర్శించారు.

ఎన్నికల్లో నల్లధనం వినియోగం పెరిగిపోయిందని అన్న ఆయన, అందుకే వామపక్షాలు చతికిల పడ్డాయన్నారు. ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ప్రకాష్ కారత్ చెప్పారు.
కాగా, ఇప్పటికే తెలంగాణ, ఒరిస్సా ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నమూనాను మార్చి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications