పోలవరం ముంపు మండలాల పరిపాలన పూర్తి స్ధాయిలో ఏపీ చేతిలోకి...
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల పరిపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రదేశ్లో విలీనం చేసిన ప్రాంతంలో ఇకనుంచి వారి అడ్మినిస్ట్రేషన్ కొనసాగనుంది.
ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఈ విషయమై చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఆయా మండలాల్లో పనిచేస్తున్న అన్నిశాఖల ఉద్యోగులకు డిసెంబర్ నెలనుంచి వేతనాలను తామే ఇస్తామని పేర్కొన్నారు. క్రిమినల్ కోడ్ నేర శిక్షాస్మృతి పరిధిని ఖరారు చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ను వెలువరిస్తామని అన్నారు.
విలీనమైన మండలాల పాలన కోసం భద్రాచలం పక్కనున్న ఎటపాకలో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ప్రకటించారు. భద్రాచలం డివిజన్కు చెందిన పోలవరం ముంపు మండలాలు చింతూరు, కూనవరం, నెల్లిపాక, వరారామంచంద్రాపురంలు ఆంధ్రప్రదేశ్లో కలిసిన విషయం తెలిసిందే.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications