మావో అగ్రనేత రామకృష్ణను పోలీసులు ఏ క్షణమైనా చంపొచ్చు. దామోదర్
మల్కన్ గిరి : మావోయిస్టు అగ్రనేత రామకృస్ణను పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆదీవాసీ హక్కులు, సంస్కృతి,పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ట్ర కార్యదర్శి దామోదర్ తిలక్ ఆరోపించారు.
ఒడిశా ఎన్ కౌంటర్ సందర్భంగా రామకృష్ణ గాయపడ్డారని, ఈ సమయంలోనే పోలీసులు రామకృష్ణను నిర్భంధించారని ఆయన ఆరోపించారు. రామకృష్ణ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన డానియేల్ మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు మల్కన్ గిరి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.విశాఖ ఏజెన్సీలో ఉన్న బాక్సైట్ గనులను దోచుకొనే క్రమంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందన్నారాయన.
పెట్టుబడిదారులు పోలీసుల ద్వారా మావోయిస్టులను హత్య చేయించారని ఆయన ఆరోపించారు మావోయిస్టులకు టీ లో మత్తుమందు ఇచ్చారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications