రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఇతడే(ఫొటోలు)
హైదరాబాద్: గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టానని ఫోన్ చేసిన నిందితుడు రాజేష్ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి చెందిన కడిగల్ల రాజేష్ కూలి పనిచేస్తున్నాడు.

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం 2, 3లలో బాంబు పెట్టానని, కాసేపట్లో అది పేలుతుందని ఫోన్ చేసి పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో స్టేషన్లో తనిఖీలు చేపట్టారు.

ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేష్ను బుధవారం అరెస్టు చేశారు. ఈ విధమైన ఫోన్ కాల్ ఎందుకు చేశావని ప్రశ్నించగా.. టైం పాస్ కోసమే తాను బాంబు బెదిరింపు ఫోన్ చేశానని రాజేష్ చెప్పడం కొసమెరుపు.
-
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications