పోలీసుల కూంబింగ్ ... రెచ్చిపోయిన స్మగ్లర్లు ... ఏం చేశారంటే...
చిత్తూరు జిల్లా శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శ్రీవారి మెట్టు నుంచి ఎస్వీ జూపార్క్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడికి తెగబడ్డారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. శ్రీవారి మెట్టు నుంచి ఎస్వీ జూపార్క్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడికి తెగబడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున జూపార్క్ లోని నల్లగుట్ట సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆరెస్సై వాసు టీంకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల గుంపు ఎదురుపడింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, స్మగ్లర్లు పోలీసులపై రాళ్ళతో దాడి చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు గుంపులుగా మొత్తం 70 మంది తమిళ స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్ళు విసిరారు. దట్టమైన పొగమంచులో.. స్మగ్లర్ల దాడిని ఎదుర్కొనేందుకు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్ఐ వాసు పేర్కొన్నారు.
రాళ్ళు విసురుతూ పారిపోతున్న వారిలో తమిళనాడులోని జావాదిమలైకి చెందిన విజయకుమార్, మణి అనే స్మగ్లర్లు పోలీసులకు దొరికిపోయారు. సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 55 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, కూబింగ్ ఇంకా కొనసాగుతోందని ఎస్ఐ వాసు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications