Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంటా రాజీనామా ఆమోదం - అక్కడే అసలు ట్విస్ట్..!?

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ వర్సస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు తారా స్థాయికి చేరాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ వర్సస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు తారా స్థాయికి చేరాయి. ఒక్క ఓటు ఇప్పుడు టీడీపీ - వైసీపీ మధ్య కీలకంగా మారింది. ఎవరు గెలవాన్నా.. ఎవరు ఓడినా ఒక్క ఓటు తేడా మాత్రమే ఉంది. ఈ సమయంలో గంటా రాజీనామా ఆమెదించారనే అంశం తెర మీదకు వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వస్తోంది. గెలుపు పైన రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. అందరి చూపు క్రాస్ ఓటింగ్..రెబల్స్ పైనే ఫోకస్ అయింది. అసెంబ్లీ కేంద్రంగా ఏం జరుగుతోంది...

ఎమ్మెల్య కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే 102 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం జగన్ ఓటు వేసారు. మొత్తం ఏడు స్థానాలకు 8 మంది బరిలో నిలిచారు. ఒక్కో ఎమ్మెల్యే గెలుపుకు 22 ఓట్లు కావాలి. వైసీపీకి ఏడుగురు అభ్యర్ధులకు కావాల్సిన 154 ఓట్ల సంఖ్యా బలం ఉంది. ఒక్క ఎమ్మెల్యే ఓటు తేడా జరిగినా ఫలితం మారిపోతుంది. టీడీపీకి 21 మంది ఓట్ల మద్దతు కనిపిస్తోంది. వైసీపీ నుంచి మరి కొందరి మద్దతు ఉందంటూ ప్రచారం చేస్తోంది. అటు వైసీపీ తమకే టీడీపీ ఓట్లు పోలవుతాయని చెబుతోంది. ఇదే సమయంలో రెండు పార్టీల్లో ఇప్పటికే ఉన్న రెబల్స్ కాకుండా.. ఇంకా క్రాస్ ఓటింగ్ కు ఎవరైనా పాల్పడుతారా అనే చర్చ సాగుతోంది. అదే జరిగిగే మొత్తం ఫలితాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Polling has started for the seven vacant MLC seats in the MLA quota, CM Jagan exercised the vote
ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా రాజీనామా ఆమోదించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీని పైన స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీని పైన గంటా స్పందించారు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ గా చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్దిని ప్రతిపాదించిన వారిలో తాను ఒకరిగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఎమ్మెల్యేగా ఓటర్ల జాబితాలో తన పేరు చేర్చిన తరువాత రాజీనామా ఆమోదించినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. తాను ఓటు వేయకుండా అడ్డుకోలేరంటూ వివరించారు. తాను స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసానని.. కానీ, ఇప్పుడు తన రాజీనామా ఆమోదిస్తే అంతకంటే వైసీపీ చేసే పెద్ద తప్పు మరొకటి ఉండదని చెప్పుకొచ్చారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం గంటా రాజీనామా ఆమోదం పైన స్పందించటం లేదు. దీని పైన సస్పెన్స్ కొనసాగుతోంది.

టీడీపీ నుంచి గెలిచిన వైసీపీకి దగ్గరైన నలుగురు అధికార పార్టీ అభ్యర్దులకే ఓట్లు వేయనున్నారు. వైసీపీ నుంచి గెలిచి..ఇప్పుడు విభేదించిన ఆనం..కోటంరెడ్డి టీడీపీకే ఓటు వేస్తారని వైసీపీ కూడా ఫిక్స్ అయింది. వారిని తమ ఓటర్లుగా చూడటం లేదు. టీడీపీ ఆ ఇద్దరితో కలిసి తమ సంఖ్యా బలం 21గా చెబుతోంది. ఇంకా టీడీపీకి ఒక ఓటు కావాలి. వైసీపీలో సీట్లు దక్కే అవకాశం లేని వారు..పార్టీలో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపైన చంద్రబాబు స్వయంగా సమీక్ష చేస్తున్నారు. విజయం పైన ధీమాగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో..ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది. తుది ఫలితం పైన ఆసక్తిని పెంచుతోంది.

Polling has started for the seven vacant MLC seats in the MLA quota, CM Jagan exercised the vote
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+