వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ముందస్తు': జగన్‌తో రూ.250 కోట్ల ఒప్పందం.. తూచ్, కొట్టిపారేసిన ప్రశాంత్ కిషోర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రూ.250 కోట్ల ఒప్పందంతో వచ్చే ఎన్నికల కోసం పని చేస్తున్నాడన్న వార్తల పైన ఎన్నకల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారని తెలుస్తోంది.

2019 ఎన్నికల కోసం వైసిపికి పని చేసేందుకు తాను ఎలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వార్తలను ప్రశాంత్ కిషోర్ కొట్టి పారేశారు. అవన్నీ అవాస్తవ ప్రచారాలు అని ఆయన కొట్టి పారేశారు.

<strong>పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు</strong>పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు

ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదికలోను స్పందించారు. మేం ఎప్పుడు కూడా హైర్ బేసిస్ మీద పని చేయమని, అలాంటప్పుడు రూ.250 కోట్లకు తమను హైర్ చేసుకున్నారనే వాదనలో నిజం ఎక్కడుందని ప్రశ్నించారు.

భారీ ఒప్పందం

భారీ ఒప్పందం

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌తో రూ.250 కోట్లకు ఆ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో..

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో..

కేంద్రంలో, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పైన జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ సదరు ఎన్నికల వ్యూహకర్తతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోందని ప్రచారం జరిగింది.

ఏపీ రాజకీయ పరిస్థితులను స్టడీ చేసి..

ఏపీ రాజకీయ పరిస్థితులను స్టడీ చేసి..

ప్రశాంత్ కీషోర్ టీం.. తొలుత రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను స్టడీ చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకత పైన కూడా సమాచారం సేకరిస్తుందని వార్తలువచ్చాయి.

వైసిపికి పని చేస్తారా?

వైసిపికి పని చేస్తారా?

అంతేకాదు, ప్రశాంత్ కిషోర్ వైసిపి నేతలతో పలుమార్లు భేటీ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారట.

English summary
Political strategist Prashant Kishor has rejected the reports of him being hired by YSR Congress. “Absolute bunkum!Tired of such uninformed speculations. When we don’t work on-hire basis, where is the question of anyone “hiring” our services?,” tweeted Kishor’s Indian Political Action Committee following a report by an Andhra based website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X