విజయవాడ కనకదుర్గమ్మ సన్నిథిలో...రాష్ట్రపతి సతీమణి సవిత కోవిద్
విజయవాడ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ సతీమణి సవిత కోవిద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్రపతి దంపతులు ఎపి పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లగా ఆయన సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయ పండితులు సవిత కోవింగ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆమె వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులున్నారు.













Click it and Unblock the Notifications