రాష్ట్రపతి ఎన్నిక: ఏపీలో, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?
రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు నవ్యాంధ్ర రాజధానిలో, తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాదులో ఓటు వేస్తున్నారు.
అమరావతి/హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు నవ్యాంధ్ర రాజధానిలో, తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాదులో ఓటు వేస్తున్నారు.

ఏపీలో ఎవరికెన్ని ఓట్లు?
ఏపీలో అధికార టిడిపి, బిజెపి, ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే పడనున్నాయి. నవ్యాంధ్రలో ఎమ్మెల్యేల ఓట్లు 27,666. ఎన్డీయే అభ్యర్థి కోవింద్కు పడే ఎంపీల ఓట్ల విలువ 22,656.
దేశవ్యాప్తంగా ఎంపీలకు ఓటు విలువ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏపీ ఎంపీల ఓటు విలువ కూడా 708 పాయింట్లు. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఒక్కో ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలువ 159.
Recommended Video


భూమా మృతితో..
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల మృతి చెందారు. మిగతా వాళ్లు ఓటు వేయనున్నారు. 174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక, ఏపీ నుంచి విపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. వారి ఓటు విలువ 2,832. ఏపీలో 174 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

తెలంగాణలో ఎవరికి ఎన్ని ఓట్లు?
తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. విపక్షాల అభ్యర్థికి ఓట్లు కేవలం నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వేయనున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు.
తెరాస నుంచి 90 ప్రజాప్రతినిధులు ఉన్నారు. బిజెపికి ఐదుగురు, టిడిపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేస్తారు. మజ్లిస్ తటస్థంగా ఉంటుంది. మిగతా వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీరు మీరా కుమార్కు ఓటు వేస్తారు.

తెలంగాణలో ఓటు విలువ..
తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్కో ఓటు విలువ 132. మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708. లోకసభ, రాజ్యసభ ఎంపీలు 24 మంది. ఇటీవల రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. దీంతో 23 మంది ఉన్నారు. వీరి ఓటు విలువ 16,284. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 31,992 పాయింట్లు.
తెరాసకు 90 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో తెరాస ఓటు విలువ 23,916. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఈ పార్టీ ఓట్ల విలువ 1,368. టిడిపి ఓట్ల విలువ 396. వీరంతా కోవింద్కు ఓటేస్తారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు కాంగ్రెస్ సభ్యులు ఓటు వేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. వీరి ఓట్ల విలువ 4,548.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications