సుమోటాగా ఏపీ సర్కారు జీవో: సీఎస్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటీవల జారీ చేసిన జీవో 2430 మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. ఈ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంతేగాక, జీవోపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. 2430 జీవో జర్నలిస్టుల విధి నిర్వహణకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. కలానికి కళ్లెం వేసే జీవోను సుమోటోగా తీసుకుంది.

ఏపీ సర్కారు విడుదల చేసిన 2430జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాక, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, సంస్థలపై చర్యలు తీసుకోనుంది.
ఈ అధికారాన్ని ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు అప్పగించడం జరిగింది. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. న్యాయపరంగా కేసులు కూడా దాఖలు చేయడం జరుగుతుంది. ఈ జీవోకు అక్టోబర్ 16న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ జీవోను విడుదల చేశారు.
కాగా, ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ జీవోపై మండిపడ్డారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications